Tuesday 7 January 2020

జగనన్న జగన్నాటకం - ముడు రాజధానుల మూల కథ.

అమరావతి..!! ముందున్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బహుగొప్పగా మొదలు పెట్టిన ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం. ముందున్న ముఖ్యమంత్రి గారు ప్రపంచంలోని అన్ని గొప్ప నగరాలని ప్రజలకు అక్కడే చూపించారు. ప్రపంచ స్థాయిలో రాజధాని నిర్మించి రైతులిచ్ఛే పొలంకి కొన్ని రెట్లు విలువ చేసే నివాస స్థలం మరియు కొంత వాణిజ్యని కి ఉపయోగకరమైన స్థలం ఇస్తామని నమ్మపలికి, సామ, దాన, దండోపాయలను ఉపయోగించి రైతుల దగ్గర నుండి కొన్ని వేల ఎకరాలను సమీకరించటం జరిగినది. అయిష్టంగా అయినా తమ పిల్లల భవిష్యత్ కోసం రైతున్నలు ఇవ్వటం జరిగినది. కొన్ని గ్రామాలు మంగళగిరి-విజయవాడ రోడ్డుకు దగ్గరగా ఉన్నా గ్రామాల్లో భూముల విలువ ముందు నుంచే ఎక్కువగా వుండటం వలన మరియు అభివృద్ధి చేసి తిరిగి ఇచ్చే భూమి విలువ ముందుగా ఉన్న విలువ కన్నా పెద్దగా వుండదు అనే విషయాన్ని పసిగట్టిన రైతులు అధిక సంఖ్యలో విముఖత చూపటం వలన ఆ గ్రామాలాలో భూముల సమీకరణ జరపలేదు. 

అమరావతిలో ముందున్న ప్రభుత్వం ప్రచారం చేసిన తొమ్మిది నగరాలు ఒకే చోట, ఆకాశం అంటే భవనాలు అంటూ అభివృద్ధి కేంద్రీకరించరానాటనికి ప్రయత్నం చేయ్యటం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం ఇన్ సైడర్ ట్రేడింగ్-బినామీ ఆస్తులు అని, అభివృద్ధికి లక్షల కోట్ల ఖర్చు అని, ఒక కులా అభివృద్ధి అని, ముంపు ప్రాంతం అని, అధికార వికేంద్రీకృతం అని చాలా కారణాలను చూపి అక్కడ నుంచి రాజధాని మార్చటానికి అన్ని రకాలుగా ప్రయత్నలు చేస్తున్నారు. 

దానిలో భాగంగా ఒక కమిటీ మరియు ఒక కన్సల్టెంట్ ఏజెన్సీకి రాజధాని ఎక్కడ ఉండాలి అనే దానిపై నివేదిక తయారు చేయుటకు నియమించారు. విచిత్రంగా కమిటీ మరియు కన్సల్టెన్సీ మక్కి మక్కి గా మూడు రాజధానులు అని తెలపడం, ఇంకొక వింత మన ముఖ్యమంత్రిగారు ఈ నివేదిక రాక ముందే మూడు రాజధానుల గురించి ఉదాహరణతో అసెంబ్లీ లో  ప్రస్తవించటం, యాదృచ్చికం అనుకోవాలా లేక ఇది పక్క ప్రణాలికతో ముఖ్యమంత్రి గారు చేసిన గారడి అనుకోవాలా?

ఎక్కడో ఒక ములన ఉన్న అభివృద్ధి చెందనీ ఒక దేశన్నీ ఉదాహరణ యిచ్చి దాని లాగానే మనకి మూడు రాజధానులు ఉంటాయి. అది అభివృద్ధి వికేంద్రీకరణ అని, ఈ నివేదికలు రాకముందే మంత్రులు మరియు MLAలు పైన చెప్పిన అమరావతికి గురించిన అన్ని వ్యతిరేక విషయలు ముందే మీడియాతో చెప్పటం. ఈ విషయంలన్నీ ముందుగానే రచించుకొన్న ప్రణాళికలు కావా?

మూడు రాజధానులు ఒకటి పరిపాలన రాజధాని(అసెంబ్లీ), రెండు కార్యనిర్వాహక రాజధాని(సెక్రటేరియట్) మరియు మూడవది న్యాయ రాజధాని(హైకోర్టు).
మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆల్రెడీ మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో హైకోర్టు ఆనేది రాష్ట్రరాజధానిలో లేవు మరియు కొన్ని రాష్ట్రాలకు కలిపి ఒకే హైకోర్టు వున్నది. కానీ గతంలో మనం రెండు రాజధానులు అనే మాట వినలేదు. రాజధాని అనేది ప్రజలకై రాష్ట్రం యొక్క అన్ని పనులు చేసే సెక్రటేరియట్ మరియు వాటిని ఆమోదించే గవర్నర్ వుండే ప్రదేశం. సెక్రెటరియాట్ లో అన్ని   మంత్రుల విభాగాలకు సంభదించిన కార్యాలయలు ఉంటాయి కావున ప్రజలు వారి విజ్ఞప్తిలు మరియు అర్జీలు పెట్టుకొనేందుకు అనువుగా ఉంటుంది. ఇది ప్రజలకి అందుబాటులో వుండాలి. కానీ మన ముఖ్యమంత్రిగారు సెక్రెటరియట్ ని తీసుకువెళ్ళి విశాఖపట్నంలో పెడుతున్నారు. అది రాయలసీమ ప్రజలకు అందుబాటులో ఉంటుందా? అనంతపురం నుంచి విశాఖపట్నం అందుబాటులో ఉంటుందా?  శ్రీకాకుళం నుండి కర్నూలు అందుబాటులో ఉంటుందా?

మిగతా రెండు రాజధానులు హైకోర్టు మరియు అసెంబ్లీ ఎక్కడ ఉన్న సామాన్య ప్రజలకు వాటి అవసరం మరియు వాటి వలన కలిగే అభివృద్ధి పెద్దగా ఏమి ఉండదు. ఎందు కంటే వాటివలన వచ్చే ఉద్యోగాలు చాలా పరిమితం, వాటికి కావల్సిన స్థలం కూడా చాలా తక్కువ. కనుక కార్యనిర్వాహక రాజధాని(exicutive capital) ఉండేదే అసలైన రాజధాని, మూడు రాజధానులు అనేది ప్రజలను తప్పుదోవ పట్టించటానికే తప్ప వేరే ఏమి ఉపయోగం లేదు. కర్నూలులో హైకోర్టు పెట్టేటప్పుడు దాని బెంచ్ అమరావతిలో ఎందుకు? అంటే వారికి అవసరమైన కేసులు అమరావతిలో నడుస్తాయా? అలాంటి అప్పుడు కర్నూలులో హైకోర్టు పెట్టి ఉపయోగం ఏమిటి? 

మరో సందేహం వచ్చే విషయం ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ అంటూనే అభివృద్ధి కేంద్రీకరించటం. ఎలా అంటే ఉమ్మడి రాష్ట్రంలో వుండగానే అభివృద్ధిలో హైదరాబాద్ తరువాత వరుసగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఉన్నాయి. ఇప్పటి మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు 80%  అది విశాఖపట్నంలొనే ఉన్నాయి. అది స్టీల్ ప్లాంట్, షిప్యర్డ్, నవల్బేస్, సాఫ్టువేరు కంపెనీలు, పర్యాటకం మరియు సినిమా పరిశ్రమ అన్ని అక్కడే ఉన్నాయి. మరి అక్కడే సెక్రెటరీట్ పెట్టి దానినే రాజధాని చేసి ఇంకా అభివృద్ధి చెయ్యటం ఎందుకు? 

అభివృద్ది వికేంద్రీకరణ లక్ష్యం అయితే అప్పుడు సెక్రెటరీట్ రాయలసీమలో ఉండాలి, అసెంబ్లీ అమరావతిలో ఉండాలి మరియు హైకోర్టు విశాఖపట్నంలో ఉండాలి. అప్పుడే అభివృద్ధి వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతంల అభివృద్ధి ధ్యేయం అనే మాటకి న్యాయం చేసినట్టు అవుతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలంటే విశాఖపట్నం కన్నా విజయనగరంలోనో లేక శ్రీకాకుళంలోనో పెట్టాలి. అలానే రాయలసీమ అభివృద్ధి జరగాలంటే రాయలసీమ నాలుగుజిల్లాలకి అందుబాటులో వుండే విధంగా అభివృద్ధి చేయాలి. 

అది అందరికి సెక్రెటరీట్ అందుబాటులో  వుండలంటే అమరావతిలో ఉంటేనే అటు రాయలసీమకు మరియు ఉత్తరాంధ్రకు మధ్యలో ఉంటుంది. అసెంబ్లీ రాయలసీమలో ఉంటే సీమ అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నంలో హైకోర్టు పెట్టుకొవచ్చు. 

విశాఖపట్నం మహానగరంగా అభివృద్ధి చెంది విస్తరణ జరిగిన అది రాయలసీమ కన్నా ఎక్కువ ఓర్రిస్స మరియు ఛత్రిస్గఢ్ వారికి ఎక్కువ ఉపయోగకరం.

 మన మంత్రులు చెప్పే లక్షకోట్లు చంద్రన్నా కలలు కన్నా చూపించిన అంతర్జాతీయ మహనగరనికే తప్ప సెక్రెటరీట్ మరియు తదితర నిర్మాణలకు కాదు. అమరావతిలో తలపెట్టిన తొమ్మిది నగరాలను నాలుగు బాగాలు చేసి నాలుగు ప్రాంతాలలో ఏర్పాటు చేసే ఆలోచనలు చేయవచ్చును.
 
 మన ముఖ్యమంత్రి గారి మూడు రాజధానుల ప్రతిపాదన ఎక్కువ అభివృద్ధి కేంద్రీకరించటమె తప్ప వికేంద్రీకరణ కాదు. ఇది రాజకీయ మంత్రంగామే తప్ప ప్రజసౌకర్యంకానీ అభివృద్ధి వికేంద్రీకరణ కానీ ఏవిధంగా ఉండదు. ఈ మూడు రాజధానులు ప్రతిపాదన అమలు చేసిన లేక చెయ్యడం కుదరక పోయిన ప్రతిపక్షాలను ఇరుకున పెట్టవచ్చు. ఎలా అంటే అమలు చేస్తే వికేంద్రీకరణ చేశాము అది వారికే సాధ్యం అని, వేరేమైన కారణాల వలన అమలు చేయలేక పోతే అది ప్రతిపక్షాల వలనే కాలేదని. అధికార పార్టీ అమరావతి పరిసర ప్రాంతాల్లో కొంచం వెనుక పడిన మిగతా రాష్ట్రంలో తిరుగులేకుండా ఎదుగుతుంది ఆనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ గారికి కలిసొస్తుంది. మన ముఖ్యమంత్రి జగన్ గారికి రాయలసీమ కన్నా ఉత్రాంధ్ర మీద ప్రేమ ఎక్కువ కురిపిస్తున్నారు ఎందుకంటే ఆయన రాయలసీమలో సెక్రెటరియేట్ అంటే మిగతా రాష్ట్ర ప్రజలు మరియు ప్రతిపక్షాలు అందరూ ఆయన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు అని అంటరానా లేక పక్క ప్రణాళికతో విశాఖలో భూదందాకి ఉపక్రమిస్తున్నారా? ఆలోచించాలిసిన విషయం.

కావున ఇది అంత జగనాన్న జగన్నాటకంమె తప్ప అభివృద్ధి వికేంద్రీకరణ కాదు.
 
అధికార మంత్రులు అమరావతిలో భూమిని ముందు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం అభివృద్ధి చేసి ఇస్తాము అంటున్నారు. రైతులను ఆందోళన చెందవద్దని వారికి న్యాయం చేస్తామంటున్నారు. మరొకరు భూములు వెనుకకు ఇస్తాము అంటారు. ఉన్న తోటలు తీసేసారు, బొరులు, బావులు పూడ్చేశారు, రోడ్లు డ్రైనేజీలు వేశారు, కొంత కాంక్రీటు పునాదులు వేశారు, కొంత ల్యాండ్ యూనివర్సిటీలకు వేరే కంపెనీలకు, కేంద్రప్రభుత్వంకు, కొంత ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, సెక్రెటరీట్, స్టాఫ్ క్వార్టర్స్ కట్టారు. వాటి మధ్య మిగిలిన భూమి చదును చేసి వెనక్కు ఇస్తారా? భూములు వెనుకకు ఇచ్చిన నాలుగు సంవత్సరాల క్రితమే వ్యవసాయం విడిచిపెట్టిన రైతన్నలు వాటికి ఉపయోగ పడే ఎద్దులు, సామగ్రి ఇంటిలో పెట్టుకొని కూర్చోంటారా? లేక అభివృద్ధి చేసి ఇచ్చిన స్థలం రైతుకు తిండి పెడుతుందా? రాజధాని లేక పోతే ఆ భూమి అమ్మోకుని జీవితం మొత్తం బ్రతకాగలడా? 
అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వగలిగిన ప్రాంతంలో మిగతా కట్టడాలకు ఖర్చు ఎక్కవ అవుతుందా? అమరావతిలో రైతుల కోసం అభివృద్ధి, అసెంబ్లీ మరియు కొన్ని భవనాలు కట్టి, విశాఖలో సెక్రటేరియట్, కర్నూలులో హైకోర్టు విడివిడిగా ఖర్చు ఎక్కువ అవుతుందా? లేక రైతుల కోసం అభివృద్ధి చేసిన అమరావతిలో అన్ని ఒకే చోట ఉండటం ఎక్కువ ఖర్చు అవుతుందా? ఆల అని ముందున్న ప్రభుత్వం ప్రతిపాదించిన తొమ్మిది నగరాలు అమరావతిలో కట్టాల్సిన పని లేదు. పరిపాలనకి అవసరమైన కట్టడాలను కట్టి మిగతా భూమిని భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలకి ఉపయోగించే విధంగా వుంచొచ్చు. అవసరం మరియు అణువు దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రభుత్వ భవనాలను మరియు మిగిలిన నగరాలను వేరే వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేసి అభివృద్ధి చేయవచ్చు. 

రైతులు రాజధానికి త్యాగం చేసారని నేను అనను కానీ వారి పిల్లల భవిష్యత్ కోసం ఉద్యోగాలకోసం త్యాగం చేశారు. అది నిరుకారిపోతున్నప్పుడు ఏ త్యాగానికైనా వెనుకాడరు అని ప్రభుత్వం గుర్తించలి. విశాఖలో రాజధాని పెట్టినట్లైతే మునుముందు ప్రత్యేక రాయలసీమ లేక గ్రేటర్ రాయలసీమ ఉద్యమం వచ్చే ప్రమాదం ఉంది. 

-సత్భోగి
07జనవరి2020



No comments:

Post a Comment