Saturday 21 June 2014

బడే గుడి

పల్లెటూరులో వుంటే వానకాలంలో చాల చూడొచ్చు, చెయ్యొచ్చు. అది మా ఊరి ప్రభుత్వ పాఠశాలలో అయితే చెప్పలేము, మేము చదువు కన్నా పిల్లల ఆటలు ఎక్కువగా అడేవాళ్ళము. వానలకి మట్టి తడిసి బొమ్మలు చేసుకోటానికి వీలుగా వుండేది. విరామాలలో పిల్లలం అందరం పందేలు పడి ఒకరికన్నా ఒకరు పెద్ద, అందమైన బొమ్మలు చేసే వారము. ఘంట కొట్టంగానే వాటిని దాచి పెట్టి వెళ్ళే వాళ్ళం. మళ్ళి వచ్చే వారకు అవి ఎండి పొయి, విరిగి పోయి, గేదెలు తొక్కేసి, ఏ కుక్కో ఆగం చేసి వుండేవి. అవి వేరే వాళ్ళు ఆగం చేసారని వాళ్ళతో గొడవ పడి, కొట్లాటలు, పంచాయితీలు, చివరగా ఇద్దరికీ దెబ్బలు, ఇవి అన్ని తరచుగా జరుగుతుండేవి.

అప్పుడు నేను నాల్గవ తరగతి చదువు తున్నాను. అప్పట్లో వినాయక చవితికి వినాయకుని విగ్రహం మట్టితో చేసేవారు. మా వూరిలో మూడు బజారుళ్లో మూడు బొమ్మలు వుంచేవారు. మా బజారులో విగ్రహంచేసేటప్పుడు పిల్లలందరం వెళ్లి దాని దగ్గర కూర్చొనిచూస్తూ, అక్కడి మట్టితో మేము చిన్న చిన్న వేరే వేరే బొమ్మలు చేసే వాళ్ళం. ఆ సంవత్సరం గుడి అంత మట్టి మట్టి చేస్తున్నామని మమల్ని అందరిని తిట్టి బయటకి పంపిచేసారు. మాకు కోపం వచ్చి బడిలో అడుకొందామని వెళ్ళాము. ఆ రోజు వాన పడి తడిసి ఉండటం వలనా ఏమి చెయ్యలో తెలియక వరండాలో కూర్చొని, మట్టి తెచ్చి ఏవో బొమ్మలు చెయ్యటం మొదలు పెట్టం. నేను వినాయకుడిని చేద్దామని చేస్తున్నాను, కొంతసేపటికి అందరు వాళ్ళ బొమ్మలు ఆపేసి బాగా చేస్తున్నాని నాకు సహాయం చెయ్యటం మొదలు పెట్టారు. ఒకడు వెళ్లి వినాయకుని కళ్ళుగా పెట్టటానికి గోలీలు తేచ్చాడు, ఇంకొకడు పెద్ద వినాయికుడికి కను బొమ్మలు, నామాలు, కడియాలు, గొలుసులుల అంటిచటానికి వాళ్ళ నాన్న కలర్ పెపర్లు తెచ్చడాని, వెళ్లి తెలియకుండా ఒక్కొక పేపర్ తీసుకొని వచ్చాడు. అందరం కలసి వినయికుడిని చాల బాగా చేసి అలంకరించం.

మా వాడు ఒకడు వెనకకి తిరిగి మాష్టారురో అని అరిసి పరుగు లంకిచుకొన్నాడు, వాడిని చూసి మిగతా అందరు వాడి వెనకాల పరిగెత్తారు. నేను, ఇంకొకడు మిగిలి పోయం, ఇంట్లో నుంచి తెచ్చిన నీల్ల కడవ, కత్తేర ఇవన్ని అక్కడ వుండటం, అవి తీసుకోకుండా వెళితే ఇక్కడ తప్పిన తన్నులు ఇంటి దగ్గర తినాలి అందుకని. ఆయన మా వేనుకే నిలబడి చూస్తున్నాడు. మా విపు మీద దెబ్బ ఎప్పుడూ పడిద్దో అన్న కంగారుగా నిలబడి వున్నాం. ఆయన చిన్నగా బొమ్మ దగ్గరికి వచ్చి బాగా చూసి ఇది ఎవరు చేశారు అని అడిగాడు. చేసినా వాళ్ళని తంతాడు అనుకొని నేను పోయినా వల్లకల్లి చూపించాను. నాతో వున్నవాడు వీడే అని చెప్పాడు. నేను వాడి కల్లి కోపంగా ఒక చూపు చూసాను. వాడికి అప్పుడు అర్ధమై అందరం కలసి చేసామని చెప్పాడు. అయన అలాగే కాసేపు అలోచించి ఇప్పుడు దిన్ని ఏమి చేస్తారు అని అడిగాడు. మా వాడు పారేస్తాం అని చెప్పాడు, నేను ఇంటికి తిసుకేలతనని చెప్పాను. మాస్టారు ఏదో అలోచించి అయిపోయింద ఇంకా ఏమైనా చెయ్యల అని అడిగాడు. నేను అయిపోయిందని చెప్పాను. 

బడి  ఒక గది తలుపులు తిసి "లోపల పెట్టండి, రేపు ఉదయం పత్రి తీసుకొని రండి. మనం పూజ చేద్దాం" అని చెప్పాడు. సరే అని తలూపి లోపల పెట్టి మా సామాను తీసుకొని బయలు దేరుతుంటే, "రేపు పిల్లలందరికి చెప్పి తీసుకురండి" అని మళ్ళి చెప్పాడు. అయన ఇల్లు బడికి దగ్గరగానే వుంటుంది, వాళ్ళ ఆవిడని అందరం పిన్ని అనే వాళ్ళం. ఆ మరునాడు ఉదయాన్నే పత్రి తీసుకొని వెళ్ళాం. మష్టారు చెప్తుంటే మేము విగ్రహాన్ని టేబులు మీద పెట్టి, అప్పుడు బడిలో కుర్చోటానికి బారు పీటలు వుండేవి, వాటిని ఒక మండపం లాగా ఒకదానిమీద ఒకటి వేసి తయరు చేసాము. వెళ్లి ఇంట్లో పూజలు చేసుకొని రమ్మని చెప్పాడు. మేము వెళ్లి వచ్చేసరికి పిన్ని పాయసం చేసి తీసుకు వచ్చింది. కొంచం సేపటిలో మావూరి పూజారి, ఉళ్ళో ఉండే మరో ఇద్దరు మస్టారులు వచ్చారు. పూజ చేసి ప్రసాదం పెట్టారు. పెద్ద పిల్లలు అంటే మాకన్నా సీనియర్స్  పక్క ఉరిలో (మా వూరిలో ఐదవ తరగతి వరకే వుంది) చదువుతుంటారు అందరు వచ్చి చూసి, సాయత్రం ఉరేగిద్దాం అని పధకం వేశారు. 

వాళ్లంత  బాగా ఆలోచించి మా వురి రైస్ మిల్లులో లాగుడు బండి వుండేది, దాన్ని మీద వురేగిద్దాం అని మాష్టారుతో మాట్లాడి ఆయనను ఒప్పించారు. వాళ్ళు వెళ్లి ఆ బండిని, పక్క టౌనుకి వెళ్లి రంగు కాగితాలు తెచ్చారు. ఆ బండిని బాగా అలంకరించి దానిలో ఆ సాయంత్రం వురేగింపు మొదలు పెట్టాము. విషయం ఎంటంటే ఏ బజారు పిల్లలు ఆ బజారు వినాయకుడి వెంట తిరిగేవారు అప్పటి వరకూ. ఇది బడిలో చేసినా వినాయకుడు కనుక పిల్లలందరూ మైకులు పెట్టె పని లేకుండా పెద్ద పెద్దగ స్లోగన్స్ చేశారు. అందరు బియ్యం ఇవ్వటం, కొబ్బరికాయలు కొట్టటం, వారు పోయటం చేశారు. మేము తీరిగి బడి చేరుకొనే వరకూ ఆ బండి బియ్యం, కొబ్బరి చిప్పలతో నిండి పోయింది. అవి అన్ని బడిలో సర్ది వెల్లిపోయాము. తరువాత రోజు బడికి వెళితే మాష్టారు బడికి సెలవు ఇచ్చి మాష్టారులు అందరు మాతో పాటు నిమర్జననికి నదికి వచ్చారు. వెళ్లేసరికి మాష్టారు మనుషులని పెట్టి వచ్చిన బియ్యతో పులిహోర చేయించాడు. అది పిల్లలందరం బాదం ఆకులలో పెట్టుకొని బోజనాలు తిన్నట్టు తిన్నాం. మాకు ఆ ముందు రోజు వచ్చిన కానుకలు అన్నీ మాష్టారు కి ఇచ్చాము. మిగతా మాష్టారులు కూడా మాష్టారుకి ఇంకా డబ్బులు ఇచ్చారు అవి అన్ని చేయించినందుకు. మాష్టారు ముందు నిరాకరించారు, మిగతా మాష్టారులు మా దగ్గర వున్న కానుకల డబ్బులు కూడా తీసుకొని ఆయనకి ఇచ్చారు.

ఆ తర్వత సంవత్సరం నుంచి పిల్లలం ఉరిలో చందాలు వసులుచేసి చెయ్యటం మొదలు పెట్టాము, నేను వరుసగా ఐదు సంవత్సరాలు వినాయకుడి బొమ్మను చేశాను. తర్వాత నేను ఊరు నుంచి బయటకి వచ్చను, మాష్టారు కూడా అదే సంవత్సరం బదిలీ అయింది. ఇప్పటికి అలానే బడిలోనే  వినాయక చవితి చేస్తున్నారు, మా బజారులో వినాయకుని పెట్టటం మానేసి బడిలో వినాయకునికి చందాలు ఇస్తున్నారు. ఈ పెద్దోలందరూ పిల్లల వినాయకుడిని వాళ్ళ వినాయకుడిని చేసుకోన్నారు. ఇప్పుడు విగ్రహాలు చెయ్యటం లేదు కొనుకోస్తున్నారు. బడికి ఇంకా రెండు రోజులు సెలవలు ఇస్తున్నారు. అప్పుడు ఒక్క అడుగు ఎత్తున్న విగ్రహం చేస్తే ఇప్పుడూ 15 అడుగుల విగ్రహం కొనుకోస్తున్నారు. 

అప్పటినుంచి అల మా బడి గుడిల మారింది . ఒక విధంగా నేను మొదలుపెట్టినది అని అనందంగా వున్న పిల్లల నుండి పెద్ద వాళ్ళు లాగేసుకున్నారు అని బాధగా కూడా అనిపిస్తుంది.

No comments:

Post a Comment