Showing posts with label మార్పు. Show all posts
Showing posts with label మార్పు. Show all posts

Tuesday, 7 January 2020

కేటాయింపులు - మార్పుకి ఇది సమయం

కేటాయింపులు (రిసర్వేషన్స్) చాల మంది దానికి వ్యతిరేకము, కానీ అది అప్పుడు ఇప్పుడు కుడా చాల అవసరము. అప్పుడు సామజిక స్థితి గతులను పరిశిలిస్తే ఈ కేటాయింపులు లేక పోతే అణగారిన వర్గాల వారు ఎప్పుడూ అలానే వుండేవారు, అంటారని వారు అంటారని వారిలానె వుండే వారు. అప్పుడు అంబేత్కర్ 10 సంవత్సరాలేనని చెప్పిన మన రాజకీయనాయకులు దానిని పొడిగించి చాల మంచి పని చేశారు. కానీ మన రాష్ట్రాలలో దాని ఫలాలు అందినట్టుగా దేశంలో అన్ని చోట్ల దాని ఫలాలు ఇంక అందలేదు. కాకాపోతే గడిచిన ఏడు దశాభ్ధాలలో చాల మార్పులు వచ్చాయి, ఒకప్పుడు అంటరాని వారని అన్నవారిలో కొందరు ఇప్పుడు కోటేశ్వరులు అయ్యారు, అగ్రకులాల వరాన్న వారు ఇప్పుడు బికారులు అయ్యారు. మరి ఇంక అదే కేటాయింపులు ఎందుకు?

నేను చుసిన వారిలోఈ కేటాయిపులని వాడు కొన్న వాళ్ళు వున్నారు. ఒకటి మా స్నేహితుడు వాళ్ళు ఇద్దరు వాడు, వాళ్ళ అన్న కానీ, వాళ్ళ రేషన్ కార్డులో నలుగురి పేర్లు వున్నాయి, మరి విల్లెవారని అని అడిగితే వాడు ఏమి చెప్పాడంటే వాళ్ళు వాళ్ళ బాబాయి పిల్లలు అని, అయన ఉద్యోగస్తుడు అని ఒక వేల ఎప్పుడైనా ప్రభుత్వం ఉద్యోగస్తుల పిల్లలకి ఈ కేటాయింపులు తిసి వేస్తే సమస్య వస్తుందని, అయన చేసినా తెలివైన పని అది, అయన పిల్లలని అన్నయ్య పిల్లలుగా చేసాడు. వారికి అలాంటి అవసరమేమి రాలేదు, చదువులో కేటాయింపులు వాడుకోన్నారో లేదో గాని వాళ్ళిప్పుడు విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. రెండవది నా జూనియర్ వాళ్ళ అమ్మానాన్నలు ఇద్దరు మన హైదరాబాదులో మంచిగా ఉద్యోగాలు చేస్తూ బాగానే సంపాదించారు, అలంటి వారు వాడిని చిన్నప్పటినుంచి  కాన్వెంటుల లోనే చదివించారు, వాడు ఈ కేటాయిపులతొ ఐఐటి లో సీటు వచ్చినది, ఆ తర్వాత ఐఐయం లో కుడా సీటు వచ్చినది, ఇప్పుడు ఒక పెద్ద అంతర్జాతీయ సంస్థలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు.

ఈ రెండు ఉధహరణలలో ఎవరికి ఈ కేటాయిపులు ఆవసరం లేదని నా వుద్దేశం, నాకు తెలిసి నా చిన్నప్పుడు నా మిత్రులు అగ్రాకులాలుగా చెప్పబడే వాటిలో వుండి కూడా వారి ఇళ్లలో చదివించే ఓపిక లేక చాల మంది మానేశారు. మొన్ననే ఒక పత్రికలో చదివాను, మన ప్రభుత్వాలు ఉపకార  వెతనలు BC లకి ఒక లక్ష, SC లకి రెండు లక్షలు లోపు ఆదాయం ఉన్నవారికే వర్తిస్తాయని ప్రకటించింది. అంటే BCల లక్ష SC ల రెండు లక్షలకూ సమానం ఎలా అవుతుంది? అదే OC లకి అదయమేమి లేక పోయినా అది వర్తించదు. ఇదేమి న్యాయం.

ఈ  రకం కుల ఆధారిత కేటాయింపుల వలనా ఎక్కువగా నష్టపోతుంది వారే అని గ్రహించటం లేదు అది ఎలా అంటే ఈ  కేటాయిపుల వలనా ప్రభుత్వరంగ సంస్థలు అన్ని అభివృద్ధి కి నోచుకోవటం లేదు. పాఠశాలలు, ఆసుపత్రులు అన్ని వెనుక పడి పోతున్నాయి. ప్రభుత్వము అన్నింటిని ప్రయవేటికరణ చేస్తుంది. వేరే విధంగా వచ్చే చాల ఉద్యోగాలు ఎవరికి రావటం లేదు. పాఠశాలలు, ఆసుపత్రులు ఉన్న ఎవరు వెళ్లటం లేదు, అల ప్రాధమిక అవసరాలైన విద్యా, వైద్యం రెండు కుంటుపడుతున్నాయి.  అది గాక ఈ కేటాయింపులను వాడు కొన్న వాల్లే వాటిని మళ్ళి మళ్ళి వాడుకొంటున్నారు. వెనుక వున్న వారికీ ఆ ఆవకశం ఎప్పటికి రాదు.

ఈ కుల ఆధారిత కేటాయింపుల ఇప్పటికైనా మారక పోతే మన దేశం చాల నష్టపోతుంది. ఈ కేటాయింపులు వున్న బిదవారు ఇంకా బిదవారు అవుతారు. ఇప్పుడు ఉన్న కుల ఆధారిత కేటాయింపులను పక్కన పెట్టి ఆర్ధిక సామర్ద్య ఆదారిత  విభజన చెయ్యాలి, మద్య తరగతి వరకూ వున్న వారందరిని కొన్ని తరగతులుగా విభజించి, ఇప్పుడు వున్న కుల ఆధారిత కేటాయింపులను అందులో పొందుపరచి తర్వాత వారి ఆర్ధిక  స్థోమతలను బట్టి వారి తరగతులను మార్చాలి. అప్పుడు ఈ కుల ఆధారిత ఉద్యమాలు, చీలికలు, ఓటు బ్యాంకు రాజకీయాలు పోతాయి, వారి వారి  ఆర్ధిక  స్థోమతలను బట్టి అందరు లబ్ది పొందుతారు.  ఇది చదువులోనే ఇవ్వాలే తప్ప ఉద్యోగాలలో ఇవ్వకూడదు, ఒక వేళ ఇవ్వవలసి వచ్చిన అది అన్నింటికి వర్తించ కూడదు, ఎలాంటివి అంటే శాస్రవేత్తలు, వైద్యులు, ఉపాద్యాయులు మరియు అర్కిటేక్లు లాంటివి. కాకాపోతే మనవారు మహా మేధావులు చాల మంది ఆరోగ్య శ్రీ కోసం అందరు లంచాలు గుమ్మరించి తెల్ల రేషను కార్డులు పొందారు. అలానే లంచాలు ఇచ్చి ఈ తరగతులు కూడా మార్చేయగలరు. UPలో SC అని సర్టిఫికేట్ పుట్టించి MPలే అయిన వారు వున్నారు. ఇలాంటివి నిరోధించా గలిగిన నాడు దేశం, ప్రజలు  అభివృద్ధి చెందుతారు.

ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగావుతయా?

నా చిన్నప్పుడు ఒక 25 సంవత్సరాలకి ముందు  ప్రభుత్వ పాఠశాలలే వుండేవి, అప్పుడే పుట్ట గోడుగులులా ఒకొక్క ప్రైవేట్ పాఠశాలలు మొదలవుతున్నా రోజులు. వాటినే కాన్వెంటులు అనేవారు. వాటికి బాగా బలసిన వాళ్ళే పిల్లలను పంపే వారు. అప్పుడే ఉద్యోగాలూ పెరుగుతున్న రోజులు అవి. చదివి ఉద్యోగం రాకపోతే ఎందుకు కాకుండా పోతారని చాల మంది పెద్ద చదువులు అంటే 10 తర్వాత పంపించటానికి కూడా ఇష్టపడే వారు కాదు. అలాంటిది ఇప్పుడు అందరు కాన్వెంటులకే పంపిస్తున్నారు. అప్పటిలో ప్రభుత్వ పాఠశాలలుకే పిల్లలు అంతంత మాత్రంగా వెళ్లటం వలనా కాలిగా వుండేవి, ఇప్పుడు అందరు టాలెంట్/టెక్నో స్కూల్ లకే పంపుతున్నారు కనుక కాలిగా వుంటున్నాయి.

2000 నుంచి చూస్తున్నాను మన ప్రభుత్వ పాఠశాలలు ఆంగ్ల మద్యమ పాటశాలలుగా మారుస్తారని, తెలుగు భాషనీ బ్రతికించాలి, రక్షించుకోవలని‌‌, ఇలా చెప్తూ వాటిని తెలుగు మాధ్యమంలోనే వుంచి అదోగతి పాలు చేస్తున్నారు. నాకు తెలుసు చాల మంది నాతో విబెదిస్తారు, కానీ ఇది నిజం. నాకు ఒక్కరిని చూపించండి తెలుగు భాష పరిరక్షన సమితి (ఏదైతే అది) దానిలో వుండి వాళ్ళ పిల్లలని లేక మనుమాలని తెలుగు మాధ్యమంలో చదివించే వారిని. మనం రోజుకొనే ఒక్క వస్తువు చూపించండి దానిపై అన్ని తెలుగులో రాసి వున్నవి లేక ఒక మందు పేరు చూపించండి లేక ఒక్క ప్రభుత్వ పత్రం చూపించండి ఇంగ్లీష్ లేకుండా (ఈ మద్య కొన్ని తెలుగులో కూడా వస్తున్నాయి, ఇంతకి ముందు అన్నిఇంగ్లీష్ లోనే  వుండేవి). మొన్ని మద్య ఓ మహాకవి గారు దూరదర్శన్ లో  కనిపించి "మా మనుమరల్లకు తెలుగు రాదు వాళ్ళు అమెరికాలో పుట్టి పెరిగారు, వాళ్ళు ఆంగ్లము లో పద్యాలూ రాస్తారు" అని చెప్పారు. అది అయన తప్పని నేను అనటం లేదు, వారికి తెలుగుని బ్రతికించాలని కోరిక వుంటే దానిని వారి పిల్లల మీద రుద్దాలి కానీ, రాష్ట్రం మొత్తం మీద ఎందుకు నెట్టాలి.

మన కర్మ కాలి పదిదాకా ఇంగ్లీష్ భాష వున్న దానిని సరిగా చెప్పే గురువులు లేక ఇస్ వాస్ ఎక్కడ వాడలో కూడా తెలియదు. డిగ్రీ చదివిన బ్యాంకు నుంచి ఎదైన ఉత్తరం వస్తే దానిని మళ్ళి బ్యాంకుకే వెళ్లి అడిగే వాళ్ళు చాలామంది వున్నారు. మరి ఎందుకి చదువులు. ఇంతక ముందు చదవక(తెలుగు) నిరక్షరస్యులు, ఇప్పుడు చదివి(తెలుగు) నిరక్షరస్యులు అంతే. ప్రయివేటు విద్యాసంస్థలు ఎంత మొత్తాలు ప్రభుత్వాలకి ముట్ట చెప్తున్నాయో కానీ ప్రభుత్వాలు పిల్లలకి భోజనాలు, గుడ్లు అని సంభందంలేని మాటలు చెప్తారే కానీ పనికొచ్చే మాట ఒక్కటి చెప్పారు. దీని వలనా తెలుగులో అనర్గళంగా మాట్లాడే వాళ్ళు కూడా ఇంగ్లీష్ లో నోరు మేధాపలేక ఉద్యోగాలు రాక కష్టపడుతున్నారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలలు కనిసం పిల్లలు లేక అటూ అద్యపకులకి, ఇటూ విద్యార్ధులకి అనశక్తి పుడుతుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు వారికీ వారే రెండో తరగతి మనుషులుగా భావానకు గురిఅవుతున్నారు.

 ప్రైవేట్ పాఠశాలలో ఉర్తిర్నులైన అద్యపకులు లేక పోయినా అవి ప్రభుత్వ పాఠశాలలు కన్నా ముందంజలో వుంటున్నాయి. గడిచిన ముప్పై సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలలో వచ్చిన మార్పులేన్నీ, ఒక్కొక్క కంప్యూటర్ కొనిచ్చి కంప్యూటర్ నేర్పించండి అంటే సరిపోతుందా? దానిలో అన్న తెలుగు వుందా? దానిని నేర్పేందుకు సరయిన అద్యపకులను నియమించిందా?

నాకు ఈ మద్య వచ్చిన సందేహం ఏమిటంటే మన కొత్త ప్రభుత్వం ఒక పేరెన్నికగన్న ప్రైవేట్ విద్య  సంస్థల చేర్మన్ ని మంత్రి వర్గం లో వుంచింది, అతను వారి పార్టిలో ముందునుంచి ఎం సేవ చేసాడో వారికే తెలియదు, వేరే వేరే సంఘ సంస్కరణలు కూడా ఏమి వినలేదు కానీ ఆయనని ఒక మంత్రిని చేసింది అంటే అయన మరి ఎంత ముట ఇచ్చాడో?

ఈ ఐదు సంవత్సరాలలో ఏమైన అవ్వొచ్చు.

ఎటు ప్రభుత్వ పాఠశాలలు/ కళాశాలలులో పిల్లలు లేరు కనుక వాటి బడ్జెట్ ఎక్కువ అవుతుందని, అవే డబ్బులు  ప్రైవేట్ పాఠశాలకి చెల్లించి చదివిద్దాం అని కొత్త చట్టం రావొచ్చు. ఇలా వారి ఋణం తిర్చుకోవాచ్చు. లేక ప్రస్తుతానికి ప్రభుత్వ పాఠశాలలను ఇంకా అదోగాతికి చేర్చె ప్రణాళికలు రూపొందించ వచ్చు.

గమనిక: నేను ఈ ప్రభుత్వమే రావాలి అని కోరుకున్న వాడిని అలా అని ప్రతీ పనిని సమర్ధించ లేము కదా!